రాయలసీమ మీద నిమ్మగడ్డ ఫోకస్.. నేడు రేపు సీమలోనే ?

-

ఆంధ్రలో పంచాయతీ ఎన్నికలు కాకరేపుతున్నాయి… రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ మాత్రం దూకుడు పెంచేశారు. ఈరోజు ఆయన రాయలసీమ పర్యటనకు వెళ్తున్నారు. రేపు కూడా అంటే రెండు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.. ముందుగా నేడు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్న ఎస్‌ఈసీ.. రేపు కడప జిల్లాల్లో పర్యటనకు వెళ్లనున్నారు.

ఆయా జిల్లాల్లో అధికారులతో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ నుంచి బయలుదేరి ఉదయం 9.10 గంటలకు బెంగళూరుకు చేరుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనంతపురంకు చేరారు. అనంత కలెక్టరేట్ లో మధ్యాహ్నం3 గంటల వరకు పంచాయతీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, డీఐజీ ఎస్పీ లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై జిల్లాలో తీసుకున్న చర్యలపై సమావేశంలో సమీక్షించనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news