అంగన్ వాడీ టీచర్ మృతి మీద వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన

-

మంచిర్యాల జిల్లా కాశిపేట హెల్త్ కేర్ వర్కర్ సుశీల మృతి పై వైద్య శాఖ ప్రకటన చేసింది. వాక్సిన్ వల్ల సుశీల మృతి చెందలేదని, ఇతర అనారోగ్య కారణాల వల్ల చనిపోయిందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 19 న వాక్సిన్ వేయించుకుందని, వాక్సిన్ వేసుకున్న పది రోజులకు సుశీల శ్వాస ఇబ్బంది తలెత్తిందని పేర్కొన్నారు.

ముందుగా మంచిర్యాల లోని ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం అందించారని మెరుగయిన వైద్యం కోసం నిన్న నిమ్స్ కు తరలించారమో డీహెచ్ శ్రీనివసరావు పేర్కొన్నారు.  శ్వాశ సంబందింత ఇబ్బందితోనే ఆమె మరణించారని అంతే కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వలన కాదని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో ఆమె మరణించారని తమకు సమాచారం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news