టీడీపీకి నారాయణ బాయ్ బాయ్…?

-

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు అధికార పార్టీ వైపు చూసారు. అధికార వైసీపీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్న కొంతమంది కీలక నేతలు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గతంలో కొంతమంది నేతలు వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీ పెద్దగా నష్టపోయిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం కొంత మంది నేతలు ఆ పార్టీలో నుంచి బయటకు రావడానికి చూస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారడానికి రెడీ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోపు ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి అధికార వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలంటున్నాయి.

నెల్లూరు జిల్లాలో గత కొంతకాలంగా ఆయన పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు కూడా ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ ప్రజల్లోకి లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయినా సరే నారాయణ పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. ఇక మంత్రి అనిల్ కుమార్ తో ఆయన స్నేహం కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో సన్నిహితంగా ఉండటం కూడా నారాయణ ఎక్కువగా కష్టపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news