బ్రేకింగ్ : తిరుపతిలో బీజేపీ కోసం పవన్ పాదయాత్ర..

-

బీజేపీ జనసేనకి చేసిన సీఎం ప్రపోజల్ పని చేసింది. పవన్ తిరుపతిలో పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. కొద్ది సేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మార్ పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పవన్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. 3వ తారీకు మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ఉంటుందని ఆయన ప్రకటించారు. బిజెపి-జనసేన ముఖ్య నాయకులు ఈ పాదయాత్ర లో పాల్గొంటారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news