కేరళలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్.. లోపలి వారు సేఫ్ ?

-

కేరళలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్.. అయింది. అయితే లోపలి వారు సేఫ్ గా ఉన్నారని తెలుస్తోంది. అబుదాబి కి చెందిన వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్ అలీ మరియు అతని భార్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎర్నాకుళంలోని పనాంగడ్ వద్ద ఒక చోటలో అత్యవసర ల్యాండింగ్ అయింది. వ్యాపారవేత్త ఎం ఎ యూసుఫ్ అలీ తో పాటు మరో నలుగురితో వెళుతున్న హెలికాప్టర్ ఈ ఉదయం కేరళలోని కొచ్చి నగరంలో క్రాష్ ల్యాండ్ అయింది.

 

ప్రాథమిక నివేదిక ప్రకారం, ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అంటున్నారు. అయితే వీరు ప్రస్తుతానికి కొచ్చిలోని లేక్ షోర్ ఆసుపత్రిలో వైద్య పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. స్థానికుల చెబుతున్న దాని ప్రకారం, పైలట్ చాకచక్యం ఒక పెద్ద విషాదాన్ని తప్పించింది. ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు, సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఆసుపత్రి అథారిటీ ప్రకారం, ఎవరూ గాయపడలేదు. అందరినీ పరిశీలనలో ఉంచుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news