భారత్‎లో 2 కోట్ల 18 లక్షలు దాటిన కరోనా కేసులు

-

న్యూఢిల్లీ: భారత్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4 లక్షల వెయ్యి 78 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 4 వేల 187మంది మృతి చెందారు. 24 గంటల్లో 3 లక్షల 18 వేల 609 మంది డిశ్చార్జ్ ఆయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 2 కోట్ల 18 లక్షల 92 వేల 276 మంది కరోనా బారిన పడ్డారు. 1 కోటి 79 లక్షల 30 వేల 960 మంది కోలుకున్నారు. 37 లక్షల 23 వేల 446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో 2 లక్షల 38 వేల 270 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 16 కోట్ల 73 లక్షల 46 వేల 544కు చేరింది. ఈ లెక్కలన్నీ అధికారికంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news