రేపు మరోసారి వాసాలమర్రికి సీఎం కెసిఆర్

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరియు రేవంత్ రెడ్డి పీసీసీ నియామకం తర్వాత… తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా మరోసారి దత్తత గ్రామం వాసాలమర్రి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు.

ఇటీవల వాసాలమర్రి లో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్… ఆ తర్వాత గ్రామ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 20 సార్లు అయినా వాసాలమర్రి కి వస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. సీఎం గ్రామం లోని దళితవాడలో పర్యటించడం తోపాటు రైతు వేదికలో 130 మంది తో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. గ్రామానికి సీఎం కేసీఆర్ రానున్న తరుణంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వాసాలమర్రి లోనూ సందడి వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news