దళిత బంధు పథకం పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

-

వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిల్ పై సీజే హిమా కోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఇక అంతకు ముందు.. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని కోర్టుకు పిటిషనర్ పేర్కొన్నారు. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందన్న ఏజీ ప్రసాద్..నిబంధనలు ఖరారు చేసినట్లు వివరించారు. నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్ లో లేదన్నారు న్యాయవాది శశికిరణ్. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటన్న హైకోర్టు.. ఏజీ వివరణ నమోదు చేసి వాసాలమర్రిలో దళిత బంధుపై విచారణ ముగించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news