వచ్చే నెల 2న ఢిల్లీకి సీఎం కేసీఆర్ !

-

ఢిల్లీ లో టిఆర్ఎస్ ఆఫీసు నిర్మాణంకు వచ్చే నెల 2 న భూమి పూజ చేయనున్నామని… ఈ కార్యక్రమం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భావన్ లో పార్టీ మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. 24, 25 జిల్లా లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు.

ktr
ktr

విజయ దశమి సమయంలో పార్టీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. భూమి పూజ కార్యక్రమంకు రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు ,ఎమ్మెల్సీలు హాజరు అవుతారని వెల్లడించారు. సెప్టెంబర్ 2 న 12 వేల 769 గ్రామ కమిటీల నిర్మాణము జరుగనుందని చెప్పారు. 3854 వార్డు కమిటీల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కొత్తగా జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని.. సరికొత్త రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు మంత్రి కేటీఆర్. సెప్టెంబర్ లోనే సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకుంటామన్నారు. పార్టీ లోని అన్నీ స్థాయి నేతలకు న్యాయం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news