రాష్ట్రంలో 19మంది డీఎస్పీల బదిలీ..!

-

తెలంగాణ రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న జి. హనుమంతరావును కుకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ గా బదిలీ చేసినట్టు ప్రకటించారు.

ఇక ఇప్పటి వరకు కూకట్ పల్లి ట్రాఫిక్ ఎసిపి గా ఉన్న ఏ. చంద్రశేఖర్ ను కూకట్పల్లి ఏసీపీ గా నియమించారు. కూకట్ పల్లి ఏసీపి గా ఉన్న బి. సురేందర్రావు సైబరాబాద్ ఏసిపి మరియు ఎస్పీగా బదిలీ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నం ఎస్పీగా ఉన్న యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ ఆఫీస్ లో… జగిత్యాల ఎస్డిపీఓగా ఉన్న పీ. వెంకటరమణ, చౌటుప్పల్ ఏసిపి గా ఉన్న పి సత్తయ్య, గద్వాల డిఎస్పి ఏ యాదగిరిని చీఫ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news