నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు- ఓవైసీ

-

అసెంబ్లీ లో మజ్లిస్ ఎమ్యెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి తాను తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నానని.. తాను అసెంబ్లీ వేదికగా అరుస్తూనే ఉన్నా- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. తన కడుపు మండుతోంది.. తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఉన్నన్ని రోజులు తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటానన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ.

హైదరాబాద్ కి మెట్రో రైలు వచ్చింది- పాతబస్తీ కి రాలేదని ప్రభుత్వం పై మండిపడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ కి మెట్రో కావాలంటే ఢిల్లీ అనుమతి కావాలని.. అందరం కలిసి ఢిల్లీ వెళ్లి అనుమతి అడుగుదామన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. పాతబస్తీ కి బస్సులు కూడా పూర్తిగా నడవడం రావడం లేదని ఆవేదన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అంతా మెట్రో నడుస్తది కానీ పాతబస్తీ అనగానే పర్యావరణ అనుమతి అడ్డు వస్తుందా ? అని నిలదీశారు అక్బరుద్దీన్ ఓవైసీ. ముస్లిం వర్గాలకు ఫ్రెండ్లీ…ఇద్దరే నని.. ఒకరు వైఎస్…మరొకరు కెసిఆర్ అని కొనియడారు తమ జీవితంలో గుర్తుండి పోయే వ్యక్తులు వీళ్లేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news