పునీత్ కు నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

-

బెంగుళూరు : కంఠీరవ స్టేడియానికి ఒక్క ఒక్కరు గా సినీ ప్రముఖులు చేరుకున్నారు. తాజాగా పునీత్‌ రాజ్‌ కుమార్‌ భౌతిక ఖాయాన్ని సందర్శించారు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్‌. కాసేపటి క్రితమే… పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేష్‌ తో పాటు శ్రీకాంత్‌, ఆలీ కూడా పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పునీత్‌ రాజ్‌ కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించారు చిరంజీవి మరియు వెంకటేష్‌. పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి చిత్ర పరిశ్రమ కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి. ఇక అంత కు ముందు… నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు నివాళులు అర్పించారు. వారితో పాటు ప్రశాంత్‌ నీల్‌, ప్రభుదేవా తదితరులు కూడా వచ్చారు. కాగా.. నిన్న మధ్యాహ్నం… పునీత్‌ గుండెపోటుతో మృతి చెందారు. రేపు ఆయన అంత్య క్రియలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news