మహిళలను తిట్టడం దురదృష్టకరం : కళ్యాణ్ రామ్ ఫైర్ !

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టిన ఘటనపై ఒక్కొక్కరు గా స్పందిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలయ్య, నందమూరి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టిన ఘటనపై స్పందించగా తాజాగా.. హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ కూడా… కామెంట్ చేశారు. మహిళలను దూషించడం దురదృష్టకరం అంటూ పేర్కొన్నారు కళ్యాణ్ రామ్.

” అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం లాంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతం గా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురు కావడం చాలా దుర దృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను ” అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news