పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు ప‌ని చేస్తే కోవార్ట్ అంటారా.. – స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్

-

తాను టీఆర్ఎస్ పార్టీ కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట ప‌డితే త‌న‌నే కోవార్ట్ అని అన్నార‌ని క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ అన్నారు. ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీ అంతు చూస్తాన‌ని అన్నారు. కాగ క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ ఇటీవ‌లే టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక సభ్య‌త్వానికి రాజీనామా చేశాడు. అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీ పై నే తిరుగుబాటు చేస్తున్నారు.

అందులో భాగం గానే స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నాడు. కాగ ఎమ్మెల్సీ ఎన్నికల కు సంబంధించిన నోటిఫికేష‌న్ వ‌చ్చిన నాటి నుంచే స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీ కి దూరం అవుతూ వ‌స్తున్నాడు. అయితే స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ కు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వక పోవ‌డం తో ఇండిపెండెంట్ అభ్య‌ర్థి గా క‌రీంన‌గ‌ర్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేశాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కి పూర్తి గా దూరం అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news