థియేటర్ టికెట్ల ధరలను ప్రకటించిన జగన్ సర్కార్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో అమ్మేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలతో చర్చలు జరిపింది జగన్ సర్కార్.

ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ టికెట్ విధానానికి మొగ్గుచూపింది సర్కార్. అయితే తాజాగా టికెట్ల ధరలను ప్రభుత్వమే విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, నగర పంచాయితీ ఏరియా, గ్రామపంచాయతీ ఏరియాల వారీగా టికెట్ల ధరలను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఈ టికెట్ల ధరలను ఫైనల్ చేస్తూ జీవో కూడా జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రతిరోజు కేవలం నాలుగు షోలు మాత్రమే నిర్వహించాలని… ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకే ఇకనుంచి సినిమా టికెట్లు అమ్మ నున్నట్టు జీవోలో పేర్కొంది. ఇక నుంచి టికెట్లు ఆన్ లైన్ లోనే తీసుకోవాలని పేర్కొంది ప్రభుత్వం. కాగా టిక్కెట్ల ధరలను పెంచాలని నిర్మాతలు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news