నేటి పుట్టిన రోజు వేడుక‌లను రద్దు చేసిన సోనియా గాంధీ

-

త్రివిధ ద‌ళాప‌తి బిపిన్ రావ‌త్ మృతి కి గౌర‌వ సూచ‌కం గా నేటి పుట్టిన రోజు వేడుక‌ల‌ను ర‌ద్దు చేస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్ర‌క‌టించారు. త‌న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ కూడా త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌ద్ద‌ని సోనియా గాంధీ కోరారు. ఆయ‌న మ‌ర‌ణం దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కు తీర‌ని లోట‌ని అన్నారు. ఆయ‌న లోటు ను ఎవ‌రూ కూడా పూడ్చ‌లేర‌ని తెలిపారు.

ఆయ‌న మృతి ని గౌర‌వ సూచిక గా నే తాను పుట్టిన రోజు వేడుక‌ల కు దూరం గా ఉంటున్నాని ప్ర‌క‌టించారు. దేశ వ్యాప్తం గా కూడా కార్య‌క‌ర్తలు ఎవ‌రూ కూడా త‌న పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకోర‌ని తెలిపారు. అయితే త‌మిళ నాడు లో ని కూనూర్ స‌మీపం లో నిన్న ఐఏఎఫ్ హెలికాప్ట‌ర్ కు ప్ర‌మాధం జ‌రిగింది.ఈ ప్ర‌మాధం లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ కన్నుమూశారు. అలాగే అత‌ని భార్య మ‌ధులిక రావ‌త్ కూడా మృతి చెందారు. అలాగే మ‌రో 11 మంది భార‌త వైమానికి ద‌ళం అధికారులు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news