రేవంత్ రెడ్డిని ఎంత పెట్టి కొన్నారు ఉత్తమ్..?: కేటీఆర్

-

Ktr fires on uttam kumar reddy

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తమ్ విమర్శలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు ఆదివాసీల అభివృద్ధి కోసం త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని ఉత్తమ్ విమర్శించారు. దానికి స్పందించిన కేటీఆర్.. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన యూపీకి చెందిన బీజేపీ ఎంపీని రాహుల్ గాంధీ ఎంత పెట్టి కొన్నారో చెప్పాలంటూ ఉత్తమ్ ను ప్రశ్నించారు. అలాగే టీఆర్ఎస్ కు చెందిన శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ లో చేరినప్పుడు వాళ్లను ఎంత పెట్టి కొన్నారో చెప్పాలన్నారు. 2014 లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిని ఎంత పెట్టి కొన్నారో చెప్పాలంటూ ఉత్తమ్ పై మండిపడ్డారు కేటీఆర్.

2018 లో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ కు చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎంతకు కొనుక్కున్నారో చెప్పాలంటూ సవాల్ విసిరారు కేటీఆర్. వీటన్నింటికీ ఉత్తమ్ సమాధానం ఇవ్వాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news