ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ కి కరోనా పాజిటివ్

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారీన పడి… చాలా మంది ప్రముఖులు చనిపోగా.. కొంత మంది కోలుకుంటున్నారు. అయితే.. తాజాగా ఫ్రాన్స్‌ ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ లియోనెల్ మెస్సీకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. లియోనెల్ మెస్సీ తో పాటు… మరో ముగ్గురు ఆటగాళ్ళకు కరోనా సోకినట్లు సమాచారం అందుతోంది.

లియో మెస్సీ తో పాటు…. జువాన్ బెర్నాట్, సెర్గియో రికో మరియు నాథన్ బిటుమజాలా కరోనా సోకిన వారిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కరోనా సోకిన ఈ నలుగురు ఆటగాళ్లు.. సెల్ఫ్‌ ఐసోలేషన్‌ లో ఉన్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే.. ఈ మధ్య కాలంలో… ఈ నలుగురు ఆటగాళ్లతో… సన్నిహితంగా ఉన్న వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా… ఫ్రాన్స్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో 219,126 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news