BREAKING : తెలంగాణలో 5 ఒమిక్రాన్ కేసులు..84 కు చేరిన సంఖ్య

-

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు 84 కేసులు నమోదు అయ్యాయి. ఈ కొత్త 5 కేసులు… విదేశాల నుంచి వచ్చిన వారికే సోకినట్లు సమాచారం అందుతోంది.

కాగా.. అటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… 274 కరోనా కేసులు, ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 227 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా… 4030 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అలాగే… ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 682489 గా నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news