స్కైలాబ్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్..

-

మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సత్యదేవ్, నిత్యామీనన్. రాహుల్ రామకృష్ణ లీడ్ క్యారెక్టర్లుగా నటించిన మూవీ స్కైలాబ్. కామెడీ ఎంటర్టైనర్ గా ఈమూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. 1979లో స్కైలాబ్ శాటిలైట్ కూలిపోయే సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీల బ్యానెర్లపై పృథ్వీ పిన్నమరాజు, నిత్యామీనన్‌ నిర్మించారు. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించారు. వినూత్న కథాంశంలో వచ్చిన ఈ కామెడీ మూవీ మంచి మార్కులే కొట్టేసింది.

నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతున్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారన్న కథాంశంతో ఈసినిమా రూపొందింది. మరికొన్ని రోజుల్లో చనిపోతున్నామని తెలిసినప్పుడు ప్రజలు ఎలా ఫీలయ్యారు.. వారితో ఫన్ ఎలా జనరేట్ అయిందనేది సినిమాలో చూపించారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలైన స్కైలాబ్ సినిమా తాజాగా ఓటీటీ బాట పట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సోని లైవ్ ఓటీటీలో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news