జగిత్యాలలో దారుణం…చేతబడి పేరుతో ఇద్దరి హత్య

-

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చేత బడులు చేస్తున్నారన్న అనుమానంతో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురుపై దాడి చేశారు ప్రత్యర్థులు. సంఘటనా స్థలంలోనే తండ్రి, కొడుకులు మృతి చెందగా… మరో కొడుగు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అక్కడే ఉన్నటు వంటి స్థానికులు… గాయపడిన వ్యక్తి ని అత్యవసర వైద్యం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మృతులు జగిత్యాల ఎరుకాల కాలనికి చెందిన జగన్నాధం నాగేశ్వర్, రాంబాబు గాయపడిన వ్యక్తి రమేష్ గా గుర్తించారు పోలీసులు. గత 20 రోజులుగా నాగేశ్వర్ కుటుంబం పై మంత్రాలతో చేతబడులు చేస్తున్నారని ఆరోపనలు రాగా ఈ రోజు ఎరుకల సంఘం మిటింగ్ నేపథ్యంలో వారి ప్రత్యర్థులు హత్య చేసినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం దాడి చేసిన వారు.. పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news