అరే బండి సంజయ్.. నువు మగాడివైతే నిధులు తీసుకురా : కవిత

-

తెలంగాణ రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎంపీ మలోత్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అరె బండి సంజయ్…ఫాల్తూ ముచ్చట్లు వద్దు అంటూ నిప్పులు చెరిగారు. 12 ఎస్టీ నియోజకవర్గలలో దమ్ము ఉంటే నీ పార్టీకి డిపాజిట్ తెచ్చుకో అని బండి సంజయ్ ని ఛాలెంజ్ చేశారు ఎంపీ కవిత.

నీవు మోగోడివి అయితే …సమక్క సారలమ్మా జాతరకు వెయ్యి కోట్లు తీసుకురా అని బండి సంజయ్ కి సవాల్ విసిరారు ఎంపీ కవిత. బండి సంజయ్ కేంద్రం నుంచి వెయ్యి కోట్లు తెస్తే… నేను సన్మామానం చేస్తా అంటూ చూరకలు అంటించారు.

తండాకు రా బండి సంజయ్ …మోడీ ఏం చేసారో… కేసీఆర్ ఏం చేసారో తేల్చుకుందామని సవాల్ విసిరారు.  గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం చేసి పంపితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదని… తెలంగాణ అభివృద్ది కేవలం సిఎం కెసిఆర్ తోనే సాధ్యమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news