రాష్ట్రంలో శాంతించిన క‌రోనా.. నేడు 3,801 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కాస్త శాంతించిన‌ట్టు క‌నిపిస్తుంది. మంగ‌ళ‌వారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,559 క‌రోనా కేసులు న‌మోదు అవ్వ‌గా.. నేడు 3,801 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అంటే రాష్ట్రంలో నిన్న‌టితో పోలిస్తే.. దాదాపు 758 క‌రోనా కేసులు త‌గ్గాయి. నేడు న‌మోదు అయిన 3,801 కేసుల‌తో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 7,47,155 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఒక‌రు కరోనా మ‌హ‌మ్మారి కాటుకు బ‌లైయ్యారు.

corona cases | కరోనా కేసులు

దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,078 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,046 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 38,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 88,867 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే నేడు క‌రోనా కేసులు కాస్త త‌గ్గిన ప్ర‌మాదం ఇంకా త‌గ్గ‌లేద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. మ‌రి కొన్ని రోజుల పాటు కరోనా కేసులు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news