మంచు విష్ణు సంచలన నిర్ణయం..మరో కొత్త బిజినెస్ కు శ్రీకారం

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో, మా అసోషియేషన్‌ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పుడు మంచి ఫామ్‌ లో కనిపిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూనే.. వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. అయితే.. ఈ మధ్య కాలంలో హీరోగా, నిర్మాతగా విష్ణు కు పెద్దగా విజయం దక్కలేదు. అయినా.. 24 ఫ్రేమ్స్‌ బ్యానర్‌ పై ఆయన సినిమాలను నిర్మిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన డిజిటల్‌ కంటెంట్‌ పై దృష్టి పెట్టినట్లుగా టాక్‌ నడుస్తోంది.

అవా ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ పై ఆయన ఓటీటీలకు అవసరమైన కంటెంట్‌ ను ఇచ్చేందుకు గానూ.. రంగంలోకి దిగినట్టుగా చెప్పుకుంటున్నారు. క్రితం ఏడాది నుంచే.. ఆయన గ్రౌండ్‌ వర్క్‌ చేస్తూ.. వచ్చారట. అయితే.. కరోనా కారణంఆ ఆచరణలో పెట్టడానికి ఆలస్యమైందని చెబుతున్నారు. ఈ బ్యానర్‌ పై ఓటీటీ సినిమాలు.. వెబ్‌ సిరీస్‌ లు నిర్మిస్తారట. ఒక వైపున 24 ఫ్రేమ్స్‌ వ్యవహారాలు చూసుకుంటూనే. మరోవైపు అవా సంస్థకు సంబంధించిన డిజిటల్‌ కంటెంట వ్యవహాలు చూస్తున్నట్లు టాక్‌.

Read more RELATED
Recommended to you

Latest news