కేసీఆర్, మోదీలు చేసింది ఏమీ లేదు…ఇద్దరు దొంగలే : షర్మిల

-

మోదీ, కేసీఆర్ లు ఇద్దరు ఓకే తాను ముక్కలని.. మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఏమిలేదు, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నది లేదని వైఎస్‌ షర్మిల నిప్పులు చెరిగారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ గారని.. ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండని నిప్పులు చెరిగారు. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ గారు… ఉన్న ఉద్యోగులను పీకేస్తూ, నిరుద్యోగులు చచ్చేలా చేస్తున్నారని మండిపడ్డారు.

మోదీ తెలంగాణకు అన్యాయం చేసి.. మహారాష్ట్రపై ప్రేమ కురిపించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే.. తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ సాధించడంలో కేసీఆర్ కొట్లాడింది లేదని మండిపడ్డారు. మోదీ కేంద్ర విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది లేదన్నారు. కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందించింది లేదని.. రేపు రాబోవు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్లు .. TRS, BJPలు ఉన్నాయని చురకలు అంటించారు. లేఖాస్త్రాల డ్రామాలకు తెరలేపాయి తప్ప.. తెలంగాణకు కేసీఆర్, మోదీలు చేసింది ఏమీ లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news