టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పుట్టగతులుండవు..నీ భరతం పడతారు : రాములమ్మ వార్నింగ్‌

-

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పుట్టగతులుండవు..నీ భరతం పడతారని కేసీఆర్‌ కు విజయశాంతి వార్నింగ్‌ ఇచ్చారు. కేసీఆర్ స‌ర్కార్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా స్పౌజ్ బ‌దిలీలు చేస్తూ… ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తోందని…ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ‘స్పౌజ్‌’ బదిలీలు చేప‌ట్టాల‌ని ఉద్యోగులు అడుగుతుంటే…“ఆయా జిల్లాల్లో పోస్టులు లేవని… కొత్తగా వేరే ఎవరైనా వస్తే కేడర్ స్ట్రెంత్ డిస్టర్బ్ అవుతుందన్నారు.

భవిష్యత్తులో నిరుద్యోగులకు ఇబ్బందని…” నిన్నటిదాకా స్పౌజ్ బదిలీలపై సర్కారు పెద్దలు కుంటి సాకులు చెప్పి… లోలోపల మాత్రం బ్లాక్ చేసిన జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ బదిలీలు కానిచ్చేశారని నిప్పులు చెరిగారు. ఈ ఎవ్వార‌మంతా సీఎస్, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫీసర్ల‌ క‌నుస‌న్న‌ల‌లో జరిగిందని.. చివరికి ఈ విష‌యం సంబంధిత మంత్రికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు కూడా సమాచారం ఇవ్వకుండా కానిచ్చేశారని మండి పడ్డారు.

రెండు రోజుల కింద నేరుగా సెక్రటేరియట్ నుంచి 13 జిల్లాల కలెక్టర్లకు సుమారు 400 మందికి సంబంధించిన స్పౌజ్ ఆర్డర్లు వాట్సాప్ ద్వారా పంపిస్తే… వీటిని కలెక్టర్లు సోమవారం డీఈవోలకు పంపించగా… వారంతా అదే రోజు ఆ టీచర్లకు గుట్టు చ‌ప్పుడు కాకుండా పోస్టింగ్స్ ఇచ్చేశారని ఆగ్రహించారు. ఈ తంతు కోసం భారీగా సొమ్ములు చేతులు మారాయి. దీనిపై టీచర్ల సంఘాలు, ప్ర‌తిప‌క్షాలు మండిపడుతున్నా… కేసీఆర్ స‌ర్కార్ మొద్దు నిద్రపోతోందని.. . ట్రాన్స్‌ఫర్లపై వచ్చిన టీచర్ల వివరాలను డీఈవోలు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్…. వెంట‌నే ఆ బ‌దిలీలను వెన‌క్కి తీసుకోవాలని… ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్ర‌భుత్వానికీ పుట్ట‌గ‌తులుండ‌వు. ఈ ఉద్యోగులే నీ భ‌ర‌తం ప‌డుతారని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news