వాహనదారులకు శుభవార్త.. త్వరలోనే తెలంగాణలో 800 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు

-

తెలంగాణ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (redco) తో గురువారం పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

జాతీయ రహదారిపై ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో ఏమీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. రెడ్కో సంస్థ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను నిర్మించి.. ఇండియన్ ఆయిల్ సంస్థకు అప్పగించింది.

సి బి జి, సిఎన్జి లాంటి పునరుద్ధారణ ఇంధన ఆధారిత చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటును సైతం పరిశీలిస్తున్నట్లు రెడ్కో వీసీ, ఎండి జానయ్య పేర్కొన్నారు. 2022 చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఎనిమిది వందల ఇవి ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ముందు ముందు ఇంకా ఎక్కువ స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా పని చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news