జగన్ పెద్ద టెర్రరిస్ట్.. అందుకే ఏపీలో దారుణ పరిస్థితులు : చంద్రబాబు

-

నేరగాళ్ళే రాజ్యం ఏలితే పరిస్థితులు ఇలానే ఉంటాయని.. సిఎం జగన్ టెర్రరిస్టులను మించి పోయాడని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిని ఈ ప్రభుత్వం వ్యవస్థీకరించిందని.. భూగర్భ ఖనిజ సంపద మొత్తం వైసీపీ నేతలు దోచేశారని నిప్పులు చెరిగారు. సెటిల్మెంట్ లు, జగన్ కు మాత్రం లక్షలాది కోట్ల రూపాయల కావాలన్నారు.

రాష్ట్రంలో ఇంకెవ్వరూ నిజాయితీగా కూడా ఒక రూపాయి కూడా సంపాదించటానికి లేదని.. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అడుక్కునే పరిస్థితికి వచ్చిందని.. వాళ్ళ ఎమ్పీలే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం అని పార్లమెంటులో చెప్పారన్నారు. జగన్ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని.. పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పి… ఇప్పటికీ ఎందుకు నిరూపించ లేకపోయారని నిప్పులు చెరిగారు.

మేము ఉంటే 2020 జూన్ కే పోలవరం పూర్తి అయి ఉండేదని.. విశాఖ రైల్వే జోన్ ఏమయ్యింది?? అని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తుంటే మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉన్నారని.. వాజ్ పాయ్ హయాం లో ఇలాంటి ప్రతిపాదన వస్తే మేము ఆపగలిగాం… అదనంగా నిధులు ఇచ్చేలా చేశామన్నారు. వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారని.. రైతులు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news