రాష్ట్రంలో కొత్త‌గా 425 క‌రోనా కేసులు.. జీరో మ‌ర‌ణాలు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. ఇప్ప‌టికే గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో 500ల‌కు దిగివ‌న క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. అందులోనూ రోజు రోజుకు కేసుల సంఖ్య త‌గ్గుతున్నాయి. గురు వారం రాష్ట్రంలో 453 కేసులు న‌మోదు కాగ‌.. నేడు రాష్ట్రంలో 425 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య 7,86,021 కు చేరింది.

అలాగే రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం లేదు. ఈ రోజు కూడా రాష్ట్రంలో కరోనా మ‌ర‌ణాలు వెలుగు చూడ‌లేదు. అలాగే రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,060 క‌రోనా బాధితులు కరోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం 6,111 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో క‌రోనా రిక‌వ‌రీ రెటు 98.70 శాతంగా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నేడు వైద్య ఆరోగ్య అధికారులు.. 41,042 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news