దేశ్ కీ నేత : ప్ర‌ధాని మోడీ గ‌డ్డ‌పై కేసీఆర్ హోర్డింగ్స్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను గురు వారం టీఆర్ఎస్ శ్రేణులు ఒక పండుగ‌ల చేశారు. కాగ కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు ప‌లు రాష్ట్రాల్లో చేశారు. అలాగే బీజేపీ సామ్రాజ్యం అయిన ఉత్త‌ర ప్ర‌దేశ్ లోనూ కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రిగాయి. అంతే కాకుండా… ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వార‌ణాసిలోనూ కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రిగాయి. మోడీ గడ్డ‌పై దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ల‌ను ఏర్పాటు చేశారు.

కాగ‌ వార‌ణాసి లోని మృత్యుంజ‌య మిశ్రా అనే వ్య‌క్తి వార‌ణాసిలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను నిర్వ‌హించాడు. అంతే కాకుండా వార‌ణాసిలో ముఖ్య‌మైన కూడ‌ళ్లు.. చౌక్ ఘాట్, ఫ‌ట్మ‌న్ రోడ్ తో పాటు ప‌లు ప్ర‌ధాన రోడ్డులు, చౌక్ ల‌లో దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ భారీ హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశాడు. కాగ ఇటీవ‌ల కేసీఆర్.. జాతీయ రాజ‌కీయాలకు వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించా.. బీజేపీ కి వ్య‌తిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుపై వ్యాఖ్య‌లు చేస్తున్న స‌మ‌యంలో ఇలాంటి హోర్డింగ్స్ వెలుగు చూడ‌టంతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ నిజంగానే దేశ్ కీ నేత అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news