దేశంలో తెలంగాణ ఓ టార్చ్ బేరర్- హరీష్ రావు

-

2022-23 తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తెలంగాణ పయణిస్తోందని ఆయన అన్నారు. దేశంలో తెలంగాాణ ఓ టార్చ్ బేరర్ గా నిలిచిందని ఆయన అన్నారు. ఈ రోజు తెలంగాణ ఏం అవలంభిస్తుందో.. రేపు దేశం అదే చేస్తుందని అన్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కేంద్ర పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. పట్టించుకోలేదని వెల్లడించారు. ప్రతీసారి తెలంగాణ ఏర్పాటును అవమాన పరిచేలా కేంద్రం మాట్లాడుతోందని.. బిడ్డను బతికించి, తల్లిని చంపేశారనే వ్యాఖ్యలు చేస్తుందని ఆయన అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తోందని హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ నిమ్స్ కు రూ. 500 కోట్లు కూడా ఇవ్వలేదని.. తెలంగాణ ఏర్పాటు తర్వాత దొడ్డి మార్గం ద్వారా తెలంగానలోని 7 మండలాలను ఏపీలో కలిపారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news