కరీంనగర్-వరంగల్ ఎన్‌హెచ్ విస్తరణకు రూ.2,146 కోట్లు

-

భారత్‌ మాల పరియోజనలో భాగంగా కరీంనగర్‌-వరంగల్‌ నగరాలను అనుసంధానించే 563వ జాతీయ రహదారిని నాలుగు లైన్లకు విస్తరించి, నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ.2,146.86 కోట్లు మంజూరు చేసింది. ఈవిషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు

Read more RELATED
Recommended to you

Latest news