తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై విజయసాయి వివాదాస్పద ట్వీట్ !

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ… ప్రతి పక్షాలపై విరుచుకుపడుతూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడును టార్గెట్‌ చేస్తారు విజయసారెడ్డి. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. నిన్న అసెంబ్లీ వేదికగా మద్యం ధరలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

మద్యం ధరలు తగ్గిస్తే… చాయి తాగినట్టు మందు తాగుతారా అని ఆయన అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు “మద్యం వినియోగాన్ని తగ్గించడానికి, అందరికీ అందుబాటులో లేకుండా చూడాలనే ధరలు పెంచుతున్నామని తెలంగాణ ఎక్సైజ్ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. దానిపై కామెంట్ చేసే ధైర్యం పచ్చబ్యాచ్ కు ఉందా? దశలవారీ నియంత్రణలో భాగంగానే ఇక్కడ రేట్లు పెంచిన సంగతి గుర్తుంచుకోవాలి. నోరు పారేసుకోవద్దు.” అంటూ టిడిపి పార్టీ కి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news