విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…. డ్రగ్ కల్చర్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వల్లనే..

-

డ్రగ్ కల్చర్ వచ్చంది తెలంగాణ ప్రభుత్వం వల్లనే అని విమర్శించారు బీజేపీ నేత విజయశాంతి. సమాజంలో డ్రగ్స్ కు బానిసైన యువత తల్లి, చెల్లి అనే భేధం లేకుండా మానభంగాలు పాల్పడుతున్నారని అన్నారు. మద్యం సేవించి ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మనకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా అంటూ ప్రశ్నించారు. కొత్తగా తెలంగాణలోకి లవ్ జీహాద్ వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత లేదని అన్నారు.

యూపీలో భద్రత లేని చోట మోదీ, యోగీ భద్రత కల్పిచారని… ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ మాఫియా చేతుల్లో లేదని ఆమె అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ యోగీ చేతుల్లో సురక్షితంగా ఉందని అన్నారు. యూపీలో రెండోసారి గెలవడానికి కారణం యోగీ చేసిన మంచి పనులే అని విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిదని అన్నారు. ఉద్యోగాలు అని కేసీఆర్ దొంగమాటలు చెబుతున్నారని.. నాలుగు రాష్ట్రాలు గెలిచిన తర్వాత భయంతో ఆసుపత్రిలో పడుకున్నారని అన్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news