దేశంలో కరోనా ఖతం… గణనీయంగా తగ్గిన కేసులు, కొత్తగా 2528 కరోనా కేసులు నమోదు

-

దేశంలో కరోనా దాదాపుగా అంతమైంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజూ వారీ కేసుల సంఖ్య 5 వేలకు దిగువనే ఉంటోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా పెరగడంతో మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. థర్డ్ వేవ్ అనంతరం దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం 2528 కొత్త కరోనా కేసులు మాత్రమే వచ్చాయి. 149 మంది కరోనా బారినపడి చనిపోయారు. 3997 మంది కరోనా బారి నుంచి రికవరీ అయ్యారు. దేశంలో మొత్తంగా చూస్తే… 29181 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డెయిలీ పాజిటివ్ రేటు 0.40 శాతానికి మాత్రమే పరిమితం అయింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి రికవరీ అయిన వారి సంఖ్య 4,24,58,543 గా ఉంది. మరణాల సంఖ్య 5,16,281గా ఉంది. దేశంలో అర్హులైన వారికి ఇప్పటి వరకు 1,80,97,94,58 టీకా డోసులు అందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news