టీఎస్‌పీజీ ఈసెట్ 2022 నోటిఫికేషన్ విడుదల

-

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీ ఈసెట్)-2022 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మా డీ(పీబీ) ఫుల్ టైం ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు: ఆన్‌లైన్
ప్రారంభం: ఏప్రిల్ 12 నుంచి
చివరి తేదీ: జూన్ 22
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500
టీఎస్‌పీజీ ఈసెట్ 2022 తేదీలు: జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు
వెబ్‌సైట్: tsche. ac.in

Read more RELATED
Recommended to you

Latest news