భువనగిరి పరువు హత్య కేసు : వాన్ని ఉరితీయండి… రామకృష్ణ భార్య సంచలన వ్యాఖ్యలు !

-

భువనగిరి పరువు హత్యలో కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రామకృష్ణ హత్యపై అతని భార్య భార్గవి సంచలన వ్యాఖ్యలు చేసింది. రామకృష్ణ , నేను ఇంటర్ నుండి ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకున్నప్పటి నుండి రామకృష్ణ పై పగ పెంచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆస్తిలో నాకు ఒక్క పైసా వద్దు అని చాలాసార్లు చెప్పానని.. మా నాన్న భయానికే నల్లగొండ, హైదరాబాద్ లలో వున్నామని వివరించింది భార్గవి. సూర్యాపేట లో వున్నప్పుడు ఒకసారి కిడ్నాప్ చేశారు…చివరకు పోలీస్ స్టేషన్ లో నాతో సంతకాలు తీసుకుని వదిలేశారని.. నా కూతురు, అత్త లకు దిక్కెవరని ప్రశ్నించింది.

మా నాన్న చాలాసార్లు నా పరువు తీశావు అన్నాడు.. రామకృష్ణ నన్ను నా తల్లితండ్రుల కంటే బాగా చూసుకున్నాడని పేర్కొంది. నా తండ్రి తో పాటు నా భర్తను హత్య చేసిన అందరినీ కటినంగా శిక్షించాలని.. రామకృష్ణ తల్లిని నా కూతురును పోషించాల్సిన బాధ్యత నాపై వుందని భార్గవి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news