జమ్మూ కాశ్మీర్: నాన్ లోకల్స్ పై దాడి చేసిన టెర్రరిస్టులను ఖతం చేసిన భద్రతా బలగాలు

-

జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదులను వరసగా ఖతం చేస్తున్నాయి మన భద్రతా బలగాలు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కర్ ఏ తోయిబా కీలక కమాండర్ ను హతమార్చాయి. తాజాగా కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇటీవల జమ్మూకాశ్మీర్ లో నివసిస్తున్న నాన్ లోకల్స్ పై దాడులకు తెగబడుతున్న ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతా బలగాలు. పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదులను ఐజాజ్, షాహిద్ అయూబ్ లుగా గుర్తించారు. వీరిద్దరిని స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు. వీరివద్ద నుంచి 2 ఏకే 47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఇద్దరిని అల్ బద్రే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు మార్చి- ఎప్రిల్ నెలల్లో పుల్వామా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులపై వరసగా దాడుల్లో పాల్గొన్నారని విజయ్ కుమార్ తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news