ఆ రాష్ట్రంలో 23 అడుగుల చెరుకు పండించి.. రికార్డు సృష్టించిన రైతు..

-

వ్యవసాయం అంటే అప్పులు, కష్టాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, అకాల వర్షాలు, నేలకొరిగిన పంటలు.. నేడు వ్యవసాయం పరిస్థితి ఇలానే ఉంది.. భూమిని నమ్ముకున్న రైతుకు అప్పులపాలు కాక తప్పడం లేదు. భరోసాలు ఏమూలకు సరిపోడవం లేదు. కానీ వ్యవసాయానికి టెక్నాలజీ జోడించి కొన్ని మెళుకువలు పాటిస్తే..ఇంతకు మించిన బిజినెస్ మరేదీ ఉండదు అంటున్నాడు.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ రైతు. టచ్ పద్దతిలో 23 అడుగుల కంటే ఎక్కువ పొడవైన చెరకును ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఈ రైతు పంట ఆ రాష్ట్రంలోని రైతుల దృష్టిని ఆకర్షించింది.

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాను రాష్ట్రవ్యాప్తంగా చెరకు బెల్ట్ అని పిలుస్తారు. ఇక్కడ చాలా మంది రైతులు చెరకునే సాగు చేస్తారు. జిల్లాలో బిలారి ప్రాంతంలో నివసిస్తున్న మహ్మద్ ముబీన్ అనే రైతు టచ్ పద్ధతిలో 23 అడుగుల కంటే ఎక్కువ పొడవైన చెరకును పండించాడు. దీంతో ఈ రైతు పంట ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చెరకును చూసేందుకు మొరాదాబాద్ మండల రైతులు మహ్మద్ ముబీన్ పొలానికి చేరుకుంటున్నారు. చెరకు ఎలా పండించాలో అర్థం చేసుకున్న మహ్మద్ ముబీన్ ఈ పద్ధతిని ఇతర రైతులకు చెప్తున్నాడు. ఈ ప్రాంత నివాసులు 23 అడుగుల గోధుమలను కూడా పండిస్తారు.

బిలారి ప్రాంతం నివాసి మహ్మద్ మోబిన్.. ఏదైనా విభిన్నంగా చేయాలనే మక్కువతో టచ్ పద్ధతిలో చెరకు పంటను పండించడం ప్రారంభించాడు. అతని పొలంలో చెరకు 23 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకున్నప్పుడు అతని ప్రయత్నం ఫలించింది. సాధారణంగా ఒక బీగా పొలంలో 40-50 క్వింటాళ్ల చెరకు మాత్రమే దిగుబడి అవుతుంది. మహ్మద్ మోబిన్ టచ్ పద్ధతిలో ఒక బీగా పొలంలో 100 క్వింటాళ్లకు పైగా పంట వచ్చింది.

రైతులు పంటను విభిన్న పద్ధతులు పండిస్తే.. మంచి లాభాలు పొందవచ్చని.. వినూత్నంగా ఆలోచించాలని రైతు మహ్మద్ ముబీన్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news