హైదరాబాద్ వాసులకు శుభవార్త..MMTS టికెట్ల ధర 50 శాతం తగ్గింపు

-

హైదరాబాద్ వాసులకు mmts అదిరిపోయే శుభ వార్త చెప్పింది. తాజాగా టికెట్ల ధరలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ జర్నీ టిక్కెట్ ధరలను తగ్గింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అలాగే mmts టికెట్ ధర 50 శాతం తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5 నుండి తగ్గిన టికెట్ ధరలు అమలు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తో సికింద్రాబాద్, ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య నడిచే రైళ్ల ల్లో ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుంది. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news