సీఎం కేసీఆర్ ది తెలంగాణ కాదు.. పక్క ఆంధ్రానే : కె ఏ పాల్

-

సిఎం కేసీఆర్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ది తెలంగాణ కాదు.. పక్క ఆంధ్రానే అని కేఏ పాల్ అన్నారు. సిఎం కేసీఆర్ కూడా అక్కడి నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్డ్ అయ్యారని.. సీఎం కేసీఆర్ కంటే ముందే జై తెలంగాణ తాను అన్నానని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్, కేటీఆర్ లు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు చేస్తున్నారు.. నిన్న సిరిసిల్ల ఎస్పీతో 3:35 నిమిషాలకు కేటీఆర్ మాట్లాడిన తరువాత నాపై దాడి జరిగిందని అగ్రహించారు కేఏ పాల్.

ముందు పదిహేను ఇరవై మంది పోలీసులు వచ్చి నిన్న నన్ను ఆపారు.. వెంటనే డిఎస్పీ, సీఐ వచ్చారని వెల్లడించారు కేఏ పాల్. నన్ను కొట్టిన వ్యక్తితో పోలీసలు బ్లూ టూత్ తో మాట్లాడారు.. నన్ను కొట్టింది కేటీఆర్ మనిషి అని మండిపడ్డారు.. నేను రైతులను దూషించలేదు.. పోలీసులు అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని అగ్రహించారు కేఏ పాల్.

Read more RELATED
Recommended to you

Latest news