సీఎం జగన్ పై కేంద్రమంత్రి ప్రశంసల వర్షం

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించిన జగన్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణలోని హనుమకొండ లో ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన దళిత బహుజన రాజ్యాధికార చైతన్య బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కొందరు దళిత, బహుజన వ్యతిరేకులు అంబేద్కర్ పేరుని వద్దని ఆందోళనలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని దేశం పురోగతి సాధిస్తుందని రాందాస్ అథవాలే అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం లోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతుందని చెప్పుకొచ్చారు.ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news