కెసిఆర్ మంచం కోళ్ళను సైతం ఎత్తుకుపోయే రకం: వైయస్ షర్మిల

-

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో సారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమకారుడు కదా అని రెండు సార్లు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజల నెత్తిన టోపీ పెట్టాడని.. చివరకు మంచం కోళ్లను సైతం ఎత్తుకుపోయే రకం ఈ కెసిఆర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ వస్తాడు.. ఈసారి ఏ బిసి బందో.. ఎస్టి బందో అంటాడు అని షర్మిల అన్నారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతుంది.

సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామం లో పాదయాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఊసరవెల్లిలా మాటలు మార్చి తెలంగాణ రైతులను బ్యాంకుల దగ్గర డీఫాల్టర్లుగా మిగిల్చారు అని అన్నారు. బ్యాంకు వాళ్లు రైతులను దొంగలుగా చూస్తున్నారని, కొన్నిచోట్ల రైతుల ఇళ్లను కూడా జప్తు చేస్తున్నారన్నారు. ఇలా అనేక సమస్యలతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే అని షర్మిల ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news