సింగర్ కేకే మరణం అనుమానాస్పదం.. తల, ముఖంపై గాయాలు

-

ప్రముఖ సింగర్ క్రిష్ణ కుమార్ కున్నత్ ( కేకే) మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మరణంపై పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. ఈ కేసును కోల్ కతా న్యూమార్కెట్ పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసుల. కోల్ కతాలో ఓ మ్యూజిక్ ఈవెంట్ కు హాజరైన కేకే ఆ తరువాత ఆయన బసచేసిన ది ఓబెరాయ్ గ్రాండ్ హోటల్ కు చేరుకున్నారు. 

అయితే హోటల్ లో ఒక్కసారిగా కుప్పకూలారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగానే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకే తల, ముఖంపై గాయాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలవనున్నాయి. కేకే అయిన గాయాలపై పోస్ట్ మార్టం తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. హోటల్లోని సీసీ కెమెరాలను పోలీసుల పరిశీలిస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కేకే మరణంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటీన కోల్ కతా చేరుకున్నారు. పోస్ట్ మార్టం తరువాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ముంబైలో కేకే అంతక్రియలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news