కోమాలో లేను.. బాగానే ఉన్నా: నిత్యానంద

-

తాను కోమాలో లేనని, బ్రతికే ఉన్నానని, రోజు సమాధి స్థితికి చేరుకుంటున్నానని వివాదాస్పద స్వామి నిత్యానంద ట్వీట్ చేశారు. ప్రస్తుతం కోస్ట్ ఇక్విడార్ సమీపంలోని ఓ దివి ని కొనుగోలు చేసుకుని కైలాస దేశంగా పేరు పెట్టుకుని శిష్యులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న నిత్యానంద కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.

నిత్యానంద్ రోజు తన సందేశాలను ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లో పెట్టేవారు. ఇటీవల కాలంలో ఎలాంటి సందేశాలు రాకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని భావించారు. ఈ నేపథ్యంలో నిత్యానంద తాజాగా ట్విట్టర్లో ఓ సందేశం విడుదల చేశారు. తాను కోమాలో లేనని, బ్రతికే ఉన్నానని త్వరలో పూర్తిగా కోలుకుని భక్తుల ముందుకు వస్తానని పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని భక్తులకు సందేశమిచ్చారు నిత్యానంద.

Read more RELATED
Recommended to you

Latest news