13ఏళ్ల దళిత బాలికపై లైంగిక దాడి.. బట్టలు విప్పి మరీ

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 13 ఏళ్ల దళిత బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. బుధవారం జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినా కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించ లేదు. చిత్రకూట్ జిల్లాలోని పహడి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిబయట నిద్రిస్తుండగా… ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు.

నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు శనివారం స్పష్టం చేశారు పోలీసులు. వీరిని నవీన్, ఆదర్శ పాండే, విఫుల్ గా గుర్తించారు పోలీసులు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాలిక మరణించినా ఎవ్వరికి చెప్పలేదు. ముందుగా చికిత్స కోసం ఆమెను కౌసంబి జిల్లా కు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించి బాలిక అక్కడే మరణించాడు. గుట్టుచప్పుడు కాకుండా శుక్రవారం బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్లారు. ఇలా ఎందుకు చేశారని విషయంపై కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news