క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్..ఇది తప్పనిసరిగా తెలుసుకోండి..

-

ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు లేకుండా ఎవరూ లేరు..ఎక్కువ మంది వీటిని వినియోగిస్తున్నారు..వీటి ద్వారా నగదు రహిత లావాదేవీలను ఎక్కువగా చేస్తున్నారు.క్రెడిట్ కార్డును వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి..జూలై 1, 2022 నుంచి క్రెడిట్‌ కార్డుకి సంబంధించిన కొన్ని నియమాలు మారబోతున్నాయి. ఇది క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళు తెలుసుకోవడం తప్పనిసరి..

 

 

జూలై 1, 2022 నుంచి అమలులోకి వస్తాయని ఆర్బీఐ తాజా నోటిఫికేషన్‌లో ప్రకటించింది. క్రెడిట్ కార్డ్ బిల్లులో ఏదైనా తప్పుగా ఉంటే వినియోగదారుడు బ్యాంకుకి ఫిర్యాదు చేయవచ్చు. ఆ సమయంలో బ్యాంకు కార్డ్ హోల్డర్ ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. బిల్లులు, స్టేట్‌మెంట్‌లను పంపడం, ఈ మెయిల్ చేయడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. అంతేకాకుండా కార్డుదారులకు తగినంత సమయం ఇవ్వాలి. అప్పుడే వారు వడ్డీ లేకుండా చెల్లింపులు చేసే అవకాశాలు ఉంటాయి.

ఒక వేళ కార్డు ను క్లోజ్ చెయ్యాలని అనుకుంటే ఆర్బీఐ ఏడు రోజుల్లో క్లోజ్ చెయ్యాలి.ఒక వేళ బ్యాంకులు ఏదైనా జాప్యం చేస్తే కంపెనీకి రోజుకు రూ. 500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ అయిన తర్వాత కార్డ్ హోల్డర్ వెంటనే ఈ మెయిల్, SMS మొదలైన వాటి ద్వారా కార్డు మూసివేసిన సంగతి తెలియజేయాలి. అలాగే బ్యాంకులు ఇష్టారీతిన క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకూడదు. ఏదైనా సరే ఆర్బీఐ నిబంధనల మేరకు నడుచుకోవాలి. ముఖ్యంగా కస్టమర్ అనుమతి లేకుండా కంపెనీ క్రెడిట్ కార్డ్‌ని జారీ చేయకూడదు.. అలా చేస్తే ఆ కంపెనీ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news