కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు లేఖ

-

అమరనాథ్ పుణ్యక్షేత్రం వరదల్లో చిక్కుకుపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ కనిపెట్టి వారి యోగ క్షేమాలు చూడాలని కోరుతూ కేంద్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాసిన చంద్రబాబు… అమరేంద్రుడు తెలుగు ప్రజల్లో చాలా ప్రసిద్ధి అన్నారు. ఏపీ నుంచి ప్రతేడాది పెద్ద సంఖ్యలో భక్తులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని అమరేంద్రుడి దర్శనం చేసుకుంటున్నారు… ఈ ఏడాది సైతం అనేక మంది భక్తులు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారని చెప్పారు.

అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం వరదల్లో భక్తులు మరణించడం చాలా బాధాకరం…ఈ నేపథ్యంలో తప్పిపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ కోసం మీ దృష్టికి తీసుకొస్తున్నాన‌ని.. చెప్పారు. ఆచూకీ తెలియక వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు… తప్పిపోయిన భక్తుల ఆచూకీ తక్షణమే కనుగొని వారికి వైద్య సహాయం, ఆహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నానని వెల్ల‌డించారు. భక్తులు వారి స్వస్థలాలు చేరుకోవడానికి ప్రయాణ ఏర్పాట్లు కూడా చేయండి…తప్పిపోయిన 37 మంది తెలుగు భక్తుల గురించి మీ తెలియజేసే సమాచారం బాధితులకు కుటుంబ సభ్యులకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పారు బాబు.

Read more RELATED
Recommended to you

Latest news