కరోనా కేసుల పై సీఎం జగన్ కీలక ఆదేశాలు

-

కరోనా కేసుల పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితుల పై సమీక్ష నిర్వహించిన సీఎం… ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్న సీఎం…ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్‌ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండోడోసు 99.69శాతం మందికి ఇచ్చామనీ వెల్లడించారు. 12 – 14 ఏళ్ల మధ్యనున్న వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తిచేశామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు.

ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం….ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలి…పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా  ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం….ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి… అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు చేస్తుంది. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూరై్తన తర్వాత ధృవీకరణ పత్రం ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news