నేడు కోనసీమ జిల్లాలో జనసేనాని పర్యటన

-

కౌలు రైతు భరోసా యాత్ర పేరటి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా నేడు శనివారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రానున్నారు. జిల్లాలోని మండపేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధికసాయం అందించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ శుక్రవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లల్ని చదివించే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఇటీవల ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.

Pawan Kalyan to go pan-India with his next project with director Krish -  Hindustan Times

ఇదిలా ఉంటే.. నిన్న అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని జనసేన నేత ఆరోపించారు నాదెండ్ల మనోహర్‌. కోనసీమ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 67 కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి నేడు పవన్‌కల్యాణ్ మండపేట వస్తున్నారని పేర్కొన్నారు. భారీ బహిరంగ సభకు జన సేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు నాదెండ్ల మనోహర్‌.

Read more RELATED
Recommended to you

Latest news